Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం
X

కూతురు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని అల్లుడిని చంపించారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఈ పరువు హత్య వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ హత్యపై అమ్మాయి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ‘ మా నాన్న ఇష్టం లేకుంటే నన్ను చంపాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది నేను. మా బావలు, మావయ్యలు, వదినలే ఈ హత్య చేయించారు’ అని ఆరోపిస్తోంది చనిపోయిన హేమంత్ భార్య అవంతి. నగరంలోని చందానగర్‌కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి మనుషులతో హేమంత్‌ను గురువారం మధ్యాహ్నం కిడ్నాప్ చేయించి, సంగారెడ్డిలో హత్య చేయించాడు. ఈ ఘటనపై మాదాపపూర్ డీసీపీ మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు...‘చందానగర్ తారానగర్ లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్ లు ఉండేవారు. అవంతి రెడ్డి బీటెక్ చదవగా, హేమంత్ డిగ్రీ కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు. ఇద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. జూన్ నెల 11 వ తేదీన పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లో మ్యారేజ్ చేసుకున్నారు.

చందానగర్ పోలీసులు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కౌన్సిలింగ్ అయిన తర్వాత హేమంత్, అవంతి రెడ్డి లు గచ్చిబౌలి లోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. కారులో ఇద్దరిని తీసుకెళ్ళారు. అయితే అవంతికి అనుమానం వచ్చి కారులో నుంచి తప్పించుకుని అత్తమామలకు ఫోన్ చేసింది. మరో కారులో హేమంత్ ను తీసుకుని పోయిన అవంతిక మేనమామ యుగంధర్ రెడ్డి, మరికొందరు హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తం అయ్యారు. గోపన్ పల్లిలో నిన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నాం. అర్ధరాత్రి అవంతిక మేనమామ యుగందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్ ను సంగారెడ్డి లో హత్య చేసి పడేసిన్నట్లు ఒప్పుకున్నాడు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నాం... మరోకరు పరారిలో ఉన్నారు’ అని తెలిపారు.

Next Story
Share it