Telugu Gateway
Andhra Pradesh

వైఎస్ కు సీఎం జగన్ నివాళి

వైఎస్ కు సీఎం జగన్ నివాళి
X

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ మంగళవారం నాడే ఇడుపులపాయ వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని వైఎస్ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

Next Story
Share it