Telugu Gateway
Politics

ప్రత్యేక హోదా..పోలవరం నిధుల కోసం ఒత్తిడి

ప్రత్యేక హోదా..పోలవరం నిధుల కోసం ఒత్తిడి
X

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ లో వైసీపీ అనుసరించాల్సిన వ్యూహాంపై దిశా, నిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం లోక్ సభలో పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో లేవనెత్తాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుంచి నిధులు వచ్చేలా, నిర్వాసితులకు నష్టపరిహారంపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేశామని, ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. జీఎస్టీ పెండింగ్ బకాయిలను రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తాం. గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. 'జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజ్‌ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు.

మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. అంతర్వేది ఘటనపై నిజాలు నిగ్గు తేలాలి. మతకలహాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సీఆర్‌డీఏ, ఫైబర్ గ్రిడ్‌లపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాలి. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి గౌరవం ఇచ్చింది. అయితే ఆయన ప్రతిపక్షాల ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నారు. పార్టీ తరపున సస్పెన్షన్ ఉండదు. ఆయనపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలి' అని మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు. '

Next Story
Share it