చంద్రబాబుకు ఏపీ పోలీసుల నోటీసులు

కీలక పరిణామం. ఏపీ పోలీసులు తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి చిత్తూరు జిల్లా మదనపల్లి డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించి ఆధారాలు అందజేయాలని కోరుతూ ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మద్యం కొనుగోలు చేస్తూ ధరల విషయంపై సీఎం జగన్ తోపాటు ఇతరులపై తీవ్ర అభ్యంతరకరభాషతో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.
ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే ఓంప్రకాష్ మరణించారు. అయితే వైసీపీ నేతల బెదిరింపుల వల్లే ఓంప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నారని..దీనికి మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే కారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతోపాటు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దీంతో పోలీసులు సీఆర్ పీసీ 91 కింద నోటీసులు ఇచ్చి..ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు అవసరమైన ఆధారాలు ఏమైనా అందజేయమని కోరటం కోసమే ఈ సెక్షన్ కింద నోటీసు అందజేస్తారు.