Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్

టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్
X

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ ప్రశ్నించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై ప్రభుత్వానికేమీ కక్షలేదు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. పవన్‌ కల్యాణ్‌ అభిమాని అనారోగ్యంతో ఉన్నారని ట్విటర్‌ పోస్ట్‌ చేసి ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే స్పందించి 10 లక్షల రూపాయల వైద‍్య సాయం​ అందించారు అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలవి చవకబారు ఆరోపణలు అని ఆయన ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

సీఎం జగన్‌ పాలనకు ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో విపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదా? ముఖ్యమంత్రి అన్ని వర్గాలవారికి న్యాయం చేస్తున్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమం అందిస్తున్నారు. 14 నెలల్లోనే 59వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కులాలు, మతాలకతీతంగా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు లబ్ధి చేకూరుతోంది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజాన్ని ముఖ్యమంత్రి జగన్‌ నెలకొల్పారు. ముఖ్యమంత్రి చక్కటి పరిపాలన చేస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది.

Next Story
Share it