Telugu Gateway
Politics

వంద సంవత్సరాలు చెక్కుచెదరకుండా టీఆర్ఎస్

వంద సంవత్సరాలు చెక్కుచెదరకుండా టీఆర్ఎస్
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. వంద సంవత్సరాలు చెక్కు చెదరకకుండా ఉండేలా టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. తెలంగాణకు కర్త కర్మ, క్రియ అన్నీ కెసీఆరే అని వ్యాఖ్యానించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు పార్టీ ఈ స్థితికి వచ్చిందన్నారు. కెటీఆర్ వ్యాఖ్యలు ఆయన మాట్లలోనే...‘జలదృశ్యం నుంచి గెంటి వేయబడ్డ పార్టీ మనది. .కార్యకర్తల శ్రమ,పట్టుదల కారణం గానే ఈ స్థాయికి వచ్చింది. కార్యకర్తలను ఆదుకునే స్థాయికి టిఆర్ ఎస్ వచ్చింది..రు.16.11 కోట్లు ప్రీమియం మొత్తంగా బీమా కంపెనీ కి చెల్లించాము.రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని ధైర్యం నింపిన నేత కెసిఆర్. 13 ఏళ్ళు ఎన్నో కుట్రలు ఎదుర్కొన్నాం. స్వీయ రాష్ట్ర ఆస్తిత్వమే మనకు రక్ష అని జయశంకర్ ఎన్నో సార్లు చెప్పారు. రాష్ట్రం బహుముఖాభివృద్ది మా లక్ష్యం. పార్టీ కార్యకర్తల శ్రమ ,పట్టుదల మాములు త్యాగాలు కావు. కెసిఆర్ స్థాపించిన ముహూర్త బలం మరో వందేళ్లు పార్టీ బలంగా ఉండేలా ఉంది. కార్య కర్తల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టే యోచన లో ఉన్నాం. టిఆర్ ఎస్ దేశంలో అజేయ మైన శక్తిగా ఎదిగింది.

టిఆర్ ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి గా మారింది. పార్టీ కార్యకర్తలను ఆదుకునే చర్యలు ఎమ్మెల్యేలు చేపట్టాలి. వారి ఇళ్లకు వెళ్లి సమస్యలు పార్టీ దృష్టికి తీసుకురండి. త్వరలో జిల్లా కార్యాలయాలు ప్రారంభిస్తాం. కరోనా కారణంగా కార్యకర్తల శిక్షణ వాయిదా వేసుకున్నాం. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసందానంగా కార్యకర్తలు ఉండాలి. కరోనాలో ప్రజలను ఆదుకునే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. నేతలు శాయ శక్తుల మేరకు ప్రజలను ఆదుకోవాలి. వ్యక్తిగతంగా సహాయం చేయాలనే నా పుట్టిన రోజు సందర్భంగా అంబులెన్సు లు ఇచ్చాం. కరోనా సంక్షోభం ముగిసే వరకు ప్రజలకు సేవలు అందించాలి. కాంగ్రెస్, బీజేపీ నేతలు పదవులు దక్కడం టిఆర్ ఎస్ పుణ్యమే. కెసిఆర్ మీద మాట తులే ముందు గుర్తించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it