టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి
BY Telugu Gateway6 Aug 2020 10:28 AM IST

X
Telugu Gateway6 Aug 2020 10:28 AM IST
తెలంగాణకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001 నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రామలింగారెడ్డి. సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేసిన సోలిపేట రామలింగారెడ్డి 2004 లో సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
రామలింగారెడ్డి వయస్సు 57 సంవత్సరాలు. ఆయనకు భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. రామలింగారెడ్డి ప్రస్తుతం అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంత్రి హరీష్ రావు చొరవతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రి మార్పించినా ప్రయోజనం లేకుండా పోయింది.
Next Story



