ఎమ్మెల్సీగా సురేష్ బాబు ఏకగ్రీవం
BY Telugu Gateway17 Aug 2020 9:38 PM IST
X
Telugu Gateway17 Aug 2020 9:38 PM IST
మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు ఏకగ్రీవం అయింది. ఈ సీటుకు అధికార వైసీపీ తరపున దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్ బాబు ఏకగ్రీవం అయ్యారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
Next Story