Telugu Gateway
Politics

కెసీఆర్ కు రెండో సారీ షాక్..సీఎం ర్యాంకింగ్స్ లో వెనకబాటు

కెసీఆర్ కు రెండో సారీ షాక్..సీఎం ర్యాంకింగ్స్ లో వెనకబాటు
X

జగన్ కు మూడవ ప్లేస్..కెసీఆర్ కు తొమ్మిదో స్థానం

ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ లో వెల్లడి

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు రెండోసారి షాక్ తగిలింది. జాతీయ స్థాయి సర్వేల ర్యాంకింగ్స్ లో తెలంగాణ సీఎం కెసీఆర్ గతంలో ఎన్నడూలేని రీతిలో వెనకబడుతున్నారు. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందు వరసలో ఉంటున్నారు. తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించి సర్వేలోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఈ సర్వేలో ఏపీ సీఎం జగన్ మూడవ స్థానం దక్కించుకోగా, తెలంగాణ సీఎం కెసీఆర్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండవ స్థానం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాల్గవ స్థానం దక్కించుకున్నారు. కొద్ది రోజుల క్రితం సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నాల్గవ స్థానం దక్కగా, కెసీఆర్ కు అందులో 16వ ప్లేస్ దక్కింది. ఇప్పుడు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ లోనూ ఇతర సీఎంల కంటే తెలంగాణ సీఎం కెసీఆర్ చాలా వెనకబడి ఉండటం విశేషం. జాతీయ స్థాయి విషయానికి వస్తే ప్రధాని నరేంద్రమోడీ తిరుగులేని ఆదిపత్యంలో ఉన్నారు. పలు అంశాల్లో ఆయనకు ప్రజల మద్దతు గణనీయంగా ఉంది.

Next Story
Share it