Telugu Gateway
Cinema

రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’కు బ్రేక్

రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’కు బ్రేక్
X

వివాదాలతో సహజీవనం చేసే రామ్ గోపాల్ వర్మ దూకుడుకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు బ్రేకులు వేసింది. విచారణ పూర్తయ్యే వరకూ ‘మర్డర్’ సినిమా విడుదల ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుని హత్య ఆధారంగా వర్మ ‘మర్డర్’ అనే పేరుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు.

ఈ సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత నల్లగొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ కోర్టు కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story
Share it