Telugu Gateway
Andhra Pradesh

మూడు రాజధానులపై రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులపై రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు
X

అంత పెద్ద యూపీకే ఒక్క రాజధాని ఉంది..పాలన సాఫీగా సాగటం లేదా?

మూడు రాజధానులు ట్రిపుల్ అవినీతికి సాధనాలుగా మారకూడదు

ఏపీలో బిజెపి పవర్ లోకి రావటం అంత ఈజీ కాదు

ప్రతిపక్ష పాత్ర ఖాళీగా ఉంది

జనాభా పరంగా ఏపీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్ కే మూడు రాజధానులు లేవని..ఏపీకి మూడు రాజధానులా? అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ఒక్క రాజధానితో యూపీలో పాలన సాఫీగా సాగిపోవటం లేదా? అని ప్రశ్నించారు. ఒక్క రాజధాని అమరావతి అవినీతిపై ఎలా పోరాడామో...ఈ మూడు రాజధానుల విషయంలోనూ అలాగే చేస్తామన్నారు. మూడు రాజధానులు ట్రిపుల్ అవినీతికి సాధనాలుగా మారకూడదన్నారు. రాష్ట్రాల రాజధానుల విషయంలో కేంద్రం పాత్రేమీ ఉండదని..ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా వేసినట్లు తెలిపారు. భూములు ఇఛ్చిన అమరావతి రైతుల్లో చిట్టచివరి రైతుకు న్యాయం జరిగే వరకూ బిజెపి అండగా నిలబడాలన్నారు. రాంమాధవ్ మంగళవారం నాడు ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బిజెపి అధికారంలోకి రావటం అంత తేలికైన వ్యవహారం కాదన్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..దాని కోసం ప్రయత్నం చేయాలన్నారు.

ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తే అంగీకరించాలి..తప్పు చేస్తే ప్రశ్నించాలన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ అయినా..టీఆర్ఎస్ అయినా తమకు ఎవరూ ప్రత్యర్ధులు ఉండకూడదనే కోరుకుంటాయని..విమర్శిస్తే వ్యక్తిగత దాడులు కూడా చేస్తాయన్నారు. కన్నా లక్ష్మీనారాయణను తీసేసి సోము వీర్రాజును పెట్టినట్లు భావించకూడదని..కన్నా మరో బాధ్యత అప్పగించే అవకాశం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో తేల్చుకోలేని స్థితిలో కొన్ని పార్టీలు ఉన్నాయని కాంగ్రెస్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. సమిష్టిగా పనిచేస్తూ లక్ష్యాన్ని అందుకోవాలని..ఈ సమిష్టి నాయకత్వంలో అధ్యక్షుడు ముందు ఉంటారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నది అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయటానికే అన్నారు.. బిజెపిది వంశంపారంపర్య పార్టీ కాదని..ఇక్కడ స్వార్ధరాజకీయాలు, పదవీ రాజకీయాలు ఉండవన్నారు. హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా అప్పటి ప్రభుత్వం ఎందుకు అంత తొందరగా వదిలిపెట్టి వచ్చేసిందో అందరకీ తెలుసన్నారు.

Next Story
Share it