ఎన్ఎస్ యూఐ ప్రగతి భవన్ ముట్టడి

పీపీఈ కిట్లు ధరించిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు బుధవారం నాడు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్ను ముట్టడించారు. పోలీసుల కళ్లు గప్పి కార్యకర్తలు క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టులో పిటీషన్ పెండింగ్లో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని తప్పుపడుతూ బుధవారం ఉదయం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.
కార్యకర్తలతో కలిసి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం చేయాల్సిన కరోనా టెస్టుల గురించి పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని విమర్శించారు.