Telugu Gateway
Telangana

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాక్ హ్యాకర్ల షాక్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాక్ హ్యాకర్ల షాక్
X

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు షాకిచ్చారు. మంత్రి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్‌ ఈ కుట్రకు పాల్పడినట్లు ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆగస్ట్‌ 15 నుంచి ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో దేశ వ్యతిరేక సందేశాలు వస్తున్నాయని గమనించిన సిబ్బంది వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు నిర్ధారించింది.

అది వ్యక్తిగత వెబ్‌సైట్‌ కావడంతో దేశ భద్రతకు సంబంధిచిన ఎలాంటి సమాచారం అందులో లేదని, కేవలం పార్టీ, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక నిపుణుల సహాయంతో వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ బారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన వెబ్ సైట్ తాత్కాలికంగా అందుబాటులో లేదు.

Next Story
Share it