సచివాలయం వైపు ఆంక్షల తొలగింపు
BY Telugu Gateway18 Aug 2020 6:35 AM GMT
X
Telugu Gateway18 Aug 2020 6:35 AM GMT
గత కొంత కాలంగా సచివాలయంవైపు రాకపోకలపై ఆంక్షలు పెట్టిన సర్కారు తాజాగా ఆంక్షలు తొలగించింది. ప్రస్తుతం తెలుగు తల్లి,ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ లపై రాకపోకలు అనుమతించారు. సచివాలయం భవనాల కూల్చివేతల్లో భాగంగా 40 రోజుల పాటు ఫ్లై ఓవర్ల పై రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కూల్చివేతలు పూర్తి కావటంతో అధికారులు ఫ్లైఓవర్స్ పై ఆంక్షలు ఎత్తేశారు. ఖైరతాబాద్ ఫై మాత్రం ఎన్టీఆర్ మార్గ్ రూట్లో సింగిల్ వే లో వాహనదారులకు అనుమతి ఇస్తున్నారు.
Next Story