Telugu Gateway
Andhra Pradesh

కేశినేని నాని ‘పంచ్’ ఎవరికో!

కేశినేని నాని ‘పంచ్’ ఎవరికో!
X

తెలుగుదేశం నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటివారు సాకారం చేయాలని కోరుకోవటం అవివేకం. అమరావతి చంద్రబాబు ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం కన్న కల. అధి సాకారం అవ్వాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాలి. ఈ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి.

మీడియా సమావేశాల వల్ల..పేపర్ స్టేట్ మెంట్ల వల్ల ప్రయోజనం లేదు’ ట్వీట్ చేశారు కేశినేని. ముఖ్యంగా టీడీపీ నేతలపై ఈ అంశంపై చాలా విమర్శలే ఉన్నాయి. ఎక్కువ ప్రెస్ మీట్లు..ఎక్కువ ట్వీట్లే పోరాటం అన్నట్లు ఉంటుంది ఆ పార్టీలో వ్యవహారం. కేశినేని ఈ వ్యాఖ్యలు ఎవరినుద్దేశించి చేశారో తేలాల్సి ఉంది.

Next Story
Share it