డీ కె శివకుమార్ కు కరోనా
BY Telugu Gateway25 Aug 2020 2:09 PM IST
X
Telugu Gateway25 Aug 2020 2:09 PM IST
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీ కె శివకుమార్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలటంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా కరోనా బారిన పడిన కోలుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వచ్చిన తొలి నాళ్ళలో కర్ణాటకలో కేసుల సంఖ్య చాలా పరిమితంగానే ఉండేది. కానీ తర్వాతర్వాత ఇతర రాష్ట్రాల తరహాలో కర్ణాటకలోనూ కేసులు గణనీయంగా పెరిగాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలను తొలగించింది. 14 రోజుల క్వారంటైన్ నిబంధనను కూడా ఎత్తేశారు.
Next Story