జగన్ జస్టిస్ ఇదేనా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘ప్రాథమిక హక్కులను కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ హరించడమేనా జగన్ జస్టిస్ అని ప్రశ్నించారు.
బిసి, ఎస్సీ,ఎస్టీలపై దాడులు, అసైన్డ్ భూములు లాక్కోవడం, ఇళ్ల కూల్చివేత జగన్ ప్రాధాన్యతా అన్నారు. 600పైగా పోస్టులలో స్వంత సామాజిక వర్గం వారినే నియమించడం జగన్ సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. అసలైన గ్రామ స్వరాజ్యాన్ని దేశానికే చూపించామని జగన్ చెప్పడం కన్నా దారుణం మరొకటి లేదన్నారు. గ్రామ స్వరాజ్యం గురించి జగన్ మాట్లాడటం, స్వరాజ్య భావననే ఎగతాళి చేయడమే పేర్కొన్నారు. ‘గాంధీజి చెప్పిన గ్రామ స్వరాజ్యం వేరు. జగన్ ప్రభుత్వం ఆచరిస్తున్న గ్రామ స్వరాజ్యం వేరు. గ్రామ స్వరాజ్యం అంటే, వైసిపికి ఆర్ధిక స్వరాజ్యం కాదు.
గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం వేరు, జగన్ ఆచరిస్తున్న గ్రామ స్వరాజ్యం వేరు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగం ప్రియాంబుల్ గురించి మాట్లాడటమా..?స్థానిక ఎన్నికల పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలపై హత్యాయత్నం గ్రామ స్వరాజ్యమా..? తప్పుడు కేసులు పెట్టి, నామినేషన్లు విత్ డ్రా చేయించడం గ్రామ స్వరాజ్యమా..?. గ్రామ వాలంటీర్లుగా స్వంత పార్టీ వాళ్లనే నియమించడం గ్రామ స్వరాజ్యమా..?కరోనా నిధులు రూ8వేల కోట్లు దారిమళ్లించడం గ్రామ స్వరాజ్యమా..? నరేగా నిధులు స్వంత పార్టీవాళ్లకే పంచిపెట్టడం గ్రామ స్వరాజ్యమా..? గ్రామీణాభివృద్దికి టిడిపి చేసిన ఖర్చులో మూడోవంతు కూడా వైసిపి చేయలేదు. ’ అని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.