ఇలా అయితే మరో 50 ఏళ్ళ ప్రతిపక్షమే
BY Telugu Gateway28 Aug 2020 11:13 AM IST
X
Telugu Gateway28 Aug 2020 11:13 AM IST
కాంగ్రెస్ పార్టీలో కలకలం ఆగటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇలాగే ఉంటే మరో 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంటుందని అన్నారు. అధ్యక్ష పదవితోపాటు అన్ని పదవులకు ఎన్నికలు జరగాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీ చుట్టూ తిరిగే వారికే పదవులు ఇవ్వటం సరికాదని..అలాంటి వారికి క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం ఉండదని తెలిపారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన కమిటీలే లేవని గుర్తు చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ల లేఖపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినా సరే గులాంనబీ ఆజాద్ పదే పదే ఇవే విషయాలను బహిరంగంగా వ్యాఖ్యానించటం ద్వారా ఆయన తాడోపేడో తేల్చుకోవటానికే సిద్ధపడినట్లు కన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి అధిష్టానం ఈ పరిణామాలపై ఎలాంటి వైఖరి అవలంభిస్తుందో వేచిచూడాల్సిందే.
Next Story