కొల్లు రవీంద్రకు బెయిల్
BY Telugu Gateway24 Aug 2020 4:51 PM IST

X
Telugu Gateway24 Aug 2020 4:51 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. పలు షరతులతో కోర్టు కొల్లుకు బెయిల్ మంజూరు చేసింది. జూలై 6వ తేదీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు.
వైసీపీ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో కుట్రదారుడనే ఆరోపణతో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతాపురం వద్ద జూలై 3న అరెస్ట్ చేశారు. జూన్ 29న మోకా భాస్కరరావు హత్యకు గురయ్యారు. మోకా భాస్కరరావు మంత్రి పేర్ని నానికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఏ4 నిందితుడిగా ఉన్నారు.
Next Story