చిరంజీవితో సోము వీర్రాజు భేటీ
BY Telugu Gateway6 Aug 2020 3:05 PM GMT
X
Telugu Gateway6 Aug 2020 3:05 PM GMT
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం నాడు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అయ్యారు. ఇటీవలే ఆయన బిజెపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇది మర్యాదపూర్వక భేటీనే అని చెబుతున్నా రాజకీయంగా వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బిజెపితో పొత్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారానికి బిజెపి, జనసేన కలసి ముందుకు సాగాలని చిరంజీవి ఆకాక్షించారు.
అదే సమయంలో కొత్తగా పదవి చేపట్టిన సోము వీర్రాజును చిరంజీవి శాలువాతో సత్కరించారు. ఈ భేటీ అనంతరం ఏపీ అభివృద్ధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహాయసహకారాలు తీసుకుని ముందుకెళ్ళాలని చిరంజీవి చేసిన సూచనను తప్పకుండా పాటిస్తామని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. బిజెపి,జనసేనలు ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
Next Story