Telugu Gateway
Andhra Pradesh

మీరు ఎక్కడ అవినీతి చేశారు..మేం అడ్డం పడటానికి?

మీరు ఎక్కడ అవినీతి చేశారు..మేం అడ్డం పడటానికి?
X

వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబునాయుడు

ఇవీ తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. ఆయన సోమవారం నాడు సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు షాక్ కు గురిచేస్తాయి. ‘మీరు ఎక్కడ అవినీతి చేశారు మేం అడ్డం పడటానికి ...మేం ఎక్కడ అడ్డంపడ్డాం మీ అవినీతికి. ’ అంటూ వ్యాఖ్యానించారు. అసలు ఆయన ఏమి చెప్పాలనుకున్నారో...ఏమి చెప్పారో ఎవరికీ అర్ధం కాదు. అమరావతి అంశంతోపాటు వరదల అంశంపై చంద్రబాబు మాట్లాడారు. విధ్వంసం జగన్ డీఎన్ఏలో ఉందని..వాళ్లు అభివృద్ధి ఏమి చేశారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎక్కడా మాట్లాడకుండా అమరావతి విషయంలో ప్రజలను వంచించారని..మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

ఎన్ని నీళ్లు వచ్చినా కూడా అమరావతి ముంపునకు గురికాలేదని..పిచ్చికుక్క అని ముద్ర వేయటానికి దుష్ప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆ ప్రచారం అయిపోయాక పౌండేషన్ వేయటానికి అధిక వ్యయం అవుతుందని మరో ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయిన అమరావతిని..రైతులను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. కరోనా విషయంలోనూ లెక్క లేకుండా వ్యవహరించారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రమంతటా దారుణంగా కేసులు విస్తరించాయన్నారు. వరద బాధితులకు కూడా సాయం చేసేవారే లేకుండా పోయారన్నారు.

Next Story
Share it