ఎయిమ్స్ లో చేరిన హోం మంత్రి అమిత్ షా
BY Telugu Gateway18 Aug 2020 10:39 AM IST
X
Telugu Gateway18 Aug 2020 10:39 AM IST
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. శ్వాసకోస సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన్ను గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రి నుంచి ఎయిమ్స్ కు తరలించారు. కొద్ది రోజుల క్రితం చేసిన కరోనా పరీక్షల్లో ఆయన నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు వైద్యం అందిస్తోంది. అమిత్ షా ఆరోగ్యం నిలకడగానే ఉందని..ఆయన ఆస్పత్రి నుంచే విధులు నిర్వహిస్తారని తెలిపారు.
Next Story