Telugu Gateway
Telangana

కొత్త సచివాలయానికి 400 కోట్ల నిధుల మంజూరు

కొత్త సచివాలయానికి 400 కోట్ల నిధుల మంజూరు
X

తెలంగాణ సర్కారు నూతన సచివాలయం నిర్మాణం విషయంలో దూకుడు చూపిస్తోంది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సచివాలయం డిజైన్ కు ఆమోదముద్రవేశారు. అంతే కాదు..దీని నిర్మాణానికి అవసరమైన 400 కోట్ల రూపాయల నిధుల మంజూరుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

దీనికి సంబంధించి త్వరలోనే ఆర్అండ్ బి శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయనుంది. ఆ వెంటనే టెండర్లు కూడా పిలిచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమీకృత నూతన సచివాలయ నిర్మాణంపై ఆర్ అండ్ బీ అధికారులు, చెన్నై ఆర్కిటెక్ట్స్ ఆస్కార్ అండ్ పొన్నిల భేటీ కానున్నారు.

Next Story
Share it