మోడీ హిందుత్వవాదానికి పునాది వేశారు
BY Telugu Gateway5 Aug 2020 4:38 PM GMT
X
Telugu Gateway5 Aug 2020 4:38 PM GMT
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్యలో భూమి పూజ అంశంపై స్పందించారు. ఆయన మొదటి నుంచి ఈ కార్యక్రమానిని ప్రధాని మోడీ హాజరు కావటంపై ఆక్షేపణ తెలుపుతున్నారు. బుధవారం నాడు కూడా ఈ అంశంపై అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ప్రధాని మోదీ హిందుత్వవాదానికి పునాది వేశారని విమర్శించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రధానికి ఏ ఒక్క మతంపై ప్రేమ ఉండకూడని అన్నారు.
ఒక మందిరం కానీ, ఒక మసీదు కానీ దేశానికి ప్రతీక కాబోవన్నారు. అయోధ్య వివాదంలో బీజేపీ, సంఘ్పరివార్ సుప్రీంకోర్టుకు అసత్యాలు చెప్పారని ఆరోపించారు. తొలుత ఆయన ట్వీటర్ వేదికగా కూడా బీజేపీ ప్రభుత్వంపై ఒవైసీ విమర్శలు చేశారు. ‘బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, కచ్చితంగా ఉంటుంది’అనే అర్థం వచ్చేలా బాబ్రీ జిందా హై అనే హ్యాష్ట్యాగ్స్తో ట్వీట్ చేశారు.
Next Story