Telugu Gateway
Telangana

తక్షణమే యూనివర్శిటీ వీసీల నియామకం

తక్షణమే యూనివర్శిటీ వీసీల నియామకం
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం నాడు యూనివర్శిటీల్లో వీసీల నియామకంతోపాటు అసెంబ్లీ సమావేశాల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. తక్షణమే యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కెసీఆర్ అధికారులను ఆదేశించారు. విసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, విసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయని సిఎం వివరించారు. కరోనా నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందని సిఎం చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విసిల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు.

ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. వచ్చే నెల 7 నుంచి జరిగే అసెంబ్లీలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో చర్చించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విప్ లు గొంగిడి సునిత, రేగ కాంతారావు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, చల్లా ధర్మారెడ్డి, గణేష్ గుప్త, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it