Telugu Gateway
Andhra Pradesh

విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు

విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు
X

ఏపీ సర్కారు విశాఖపట్నంలోని కాపులుప్పాడలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. భీమునిపట్నం మండలంలోని కాలులుప్పాడలోని సర్వే నెంబర్ 386/2లో 300 ఎకరాల్లో 30 ఎకరాలు గెస్ట్ హౌస్ నిర్మాణానికి కేటాయించారు. ఈ భూమిని గ్రేహౌండ్స్ కు కేటాయించారు గతంలో.

జిల్లా కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర గెస్ట్ హౌస్ కు ఈ కేటాయింపులు చేశారు. సంబంధిత శాఖలు అన్నీ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుని రికార్డుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. అత్యవసర ప్రాతిపదికన ఈ పనిని పరిగణించాలన్నారు.

Next Story
Share it