విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు
BY Telugu Gateway27 Aug 2020 5:32 PM IST

X
Telugu Gateway27 Aug 2020 5:32 PM IST
ఏపీ సర్కారు విశాఖపట్నంలోని కాపులుప్పాడలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. భీమునిపట్నం మండలంలోని కాలులుప్పాడలోని సర్వే నెంబర్ 386/2లో 300 ఎకరాల్లో 30 ఎకరాలు గెస్ట్ హౌస్ నిర్మాణానికి కేటాయించారు. ఈ భూమిని గ్రేహౌండ్స్ కు కేటాయించారు గతంలో.
జిల్లా కమిటీ సిఫారసు మేరకు రాష్ట్ర గెస్ట్ హౌస్ కు ఈ కేటాయింపులు చేశారు. సంబంధిత శాఖలు అన్నీ తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుని రికార్డుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. అత్యవసర ప్రాతిపదికన ఈ పనిని పరిగణించాలన్నారు.
Next Story