Telugu Gateway
Andhra Pradesh

కోర్టులపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

కోర్టులపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోర్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు..సుప్రీంకోర్టులకు చెప్పి పార్టీలు మ్యానిఫెస్టోలు తయారు చేయవు కదా? అని ఆయన ప్రశ్నించారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో కోర్టులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉన్న వాళ్లే భూ కబ్జాలు చేస్తారని..కానీ పేదలు మాత్రం అలాంటి పనులు చేయరన్నారు. అదే సమయంలో నారాయణస్వామి అదే సమయంలో నారాయణస్వామి చంద్రబాబుపై.. విమర్శల వర్షం కురిపించారు. సోమవారం చిత్తూరులో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికీ మూడు తేదీలు మారటం బాధాకరమన్నారు. చంద్రబాబు అనవసరంగా రకరకాలైన కుంటిసాకులతో పేదలకు పంపిణీ చేస్తున్న ఇళ్లను అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టులు కూడా పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై త్వరగా మంచి నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. ఇళ్లను అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు కూడా పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై త్వరగా మంచి నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. 27 గ్రామాల కోసమే చంద్రబాబు 3 రాజధానుల అంశాన్ని కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అన్నపూర్ణగా పేరు పొందిన అమరావతి ప్రాంతంలోని భూములను చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ కోసమే రాజధాని భూములుగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా కేవలం జగన్ మోహన్ రెడ్డి వచ్చాక మాత్రమే పేదలకు ఆర్థిక స్వతంత్యం వచ్చింది అని డిప్యూటీ సీఎం స్వామి వ్యాఖ్యానించారు.

Next Story
Share it