రమణదీక్షితుల ట్వీట్ పై వై వీ సుబ్బారెడ్డి అభ్యంతరం
BY Telugu Gateway16 July 2020 4:23 PM IST

X
Telugu Gateway16 July 2020 4:23 PM IST
తిరుమలలో ఇప్పట్లో దర్శనాలు నిలిపివేసే ఆలోచన లేదని టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీలో 40 మంది ఉద్యోగులకు కరోనా వచ్చిందని..అందులో 14 మంది అర్చకులు ఉన్నారని తెలిపారు. టీటీడీ ఈవో, ఏఈవోలను ఉద్దేశించి రమణదీక్షితులు చేసిన ట్వీట్ పై సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆయన ఏమైనా చెప్పాలనుకుంటే బోర్డుకు చెప్పాలే తప్ప..ఇలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. రమణదీక్షితులను పిలిచించి మాట్లాడాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే బ్రహ్మోత్సవాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story