Telugu Gateway
Andhra Pradesh

శానిటైజర్ తాగి పది మంది మృతి

శానిటైజర్ తాగి పది మంది మృతి
X

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఏకంగా పది మంది మృత్యువాత పడ్డారు. మద్యం దొరక్క వీరంతా శానిటైజర్ తాగారు. మద్యానికి బానిస అయిన కొంత మంది బిక్షగాళ్ళు ఈ పనిచేశారు. తర్వాత గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు కూడా నాటు సారాలో శానిటైజర్ కలుపుకుని తాగారు. కొంత మంది గురువారం రాత్రే మరణించగా..మరికొంత మంది వైద్యం పొందుతూ శుక్రవారం నాడు తుది శ్వాస విడిచారు. కరోనా దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాలు లేకపోవటంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్‌ తాగారు.

మద్యం దొరకక కొంతకాలంగా వీరు శానిటైజర్ తాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను దర్శి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. చనిపోయిన వారు శానిటైజర్ నేరుగా సేవించారా? లేక ఇతర ద్రావకాలతో కలుపుకుని సేవించారా అన్నది పరిశీలించాల్సి ఉందని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తెలిపారు.

Next Story
Share it