Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్

ఏపీ సచివాలయంలో కరోనా టెన్షన్
X

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు విధులకు హాజరవుతున్నా కరోనా టెన్షన్ మాత్రం వీడటం లేదు. తాజాగా చేసిన పరీక్షల్లో ఈ కేసులు వెల్లడయ్యాయి. సచివాలయంలో పది మందికి, అసెంబ్లీలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది.

సచివాలయంలో కరోనా బారిన పడ్డ వారిలో సాగునీటి శాఖలో ముగ్గురు, పశు సంవర్ధక శాఖలో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా వెల్లడైన పాజిటివ్ కేసు బాధితులతో సన్నిహితంగా ఉన్న వారందరినీ ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.

Next Story
Share it