Telugu Gateway
Cinema

రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై రాళ్ల రాడి

రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై రాళ్ల రాడి
X

‘పవర్ స్టార్ ’ సినిమా టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఆయన మాత్రం ఇది ఫిక్షనల్ కథ అని..ఎవరికీ సంబంధం లేదంటూ చెబుతున్నారు. ఇప్పటికే వర్మ విడుదల చేసిన గడ్డి తింటావా పాటతోపాటు పవర్ స్టార్ ట్రైలర్ కూడా సినిమా ఉద్దేశం ఏంటో స్పష్టం గా చెబుతోంది. జులై 25న సినిమాను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల చేయనున్నారు. ఈ తరుణంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని వర్మ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. కొంత మంది యువకులు జూబ్లిహిల్స్ లో వర్మ కార్యాలయంలోకి రాళ్లు విసరటంతో అద్దాలు పగిలాయి. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా జనసేన కార్యకర్తల పనే అని వర్మ ఆరోపిస్తున్నారు. ఇటీవలే వర్మ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని..ఇలాంటి బెదిరింపులు చాలా చూశానని బస్తీ మే సవాల్ అంటూ ట్వీట్ చేశారు కూడా.

అయితే వర్మ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దాడికి కారకులు ఎవరనే అంశంపై విచారణ జరుపుతున్నారు.. పవర్ స్టార్ సినిమాకు కౌంటర్ గా రామ్ గోపాల్ వర్మపై పరాన్న జీవి అనే సినిమా కూడా రెడీ అవుతోంది. ఈ పరిణామాలపై టాలీవుడ్ లో కీలక వ్యక్తులు అందరూ మౌనంగా ఉంటున్నారు తప్ప ఎవరూ నోరు తెరిచి మాట్లాడటం లేదు. యువ హీరో నిఖిల్ ఈ వ్యవహారంపై స్పందించి..రామ్ గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. దీనిపై కూడా వర్మ స్పందించారు. నిఖిల్ ఎవరో తనకు తెలియదని..ఆయన పెద్ద హీరో అయితే కావొచ్చని ఓ ఛానల్ లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా మాట్లాడితే ఆయన మద్దతు లభిస్తుందనే భావంతో వీళ్లంతా మాట్లాడతారని..ఇది వాళ్ళ బానిస మనస్తత్వాన్ని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it