Telugu Gateway
Politics

ప్రజల ఇళ్ళకు అక్కడ ‘కాషాయ’ రంగులేశారు

ప్రజల ఇళ్ళకు అక్కడ ‘కాషాయ’ రంగులేశారు
X

ఆ ఇంటి ఓనర్ల అనుమతి లేదు. వాళ్లకు మాట మాత్రం కూడా చెప్పలేదు. అంతే ఆ ఏరియాలో ఇళ్ళు అన్నింటికి కాషాయ రంగు వేసేశారు. ఇదెక్కడి వ్యవహారం అంటూ ఏకంగా ఇద్దరు వ్యక్తులు పోలీసు స్టేషన్ లో కేసులు కూడా పెట్టేశారు. ఇది అంతా ఎక్కడ జరిగింది అంటారా?. ఉత్తరప్రదేశ్ లోని బహదూర్ గంజ్ ప్రాంతంలోని ప్రయాగ్ రాజ్ లో. ఇది అక్కడ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు కొంత మంది తమ ఇళ్ళకు రంగు వేశారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయగా తమపై దాడి చేశారని ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదు చేయటంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీని వెనక ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రి నందగోపాల్ గుప్తా ఉన్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి గుప్తా సుందరీకరణలో భాగంగా ఆ ఇళ్లకు కాషాయ రంగు వేశారని..ఈ అంశంపై కేసుల వెనక సమాజ్ వాది పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపించారు.

Next Story
Share it