రాయపాటి ఆస్తుల వేలం

తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. ఆయనకు చెందిన ఆస్తుల వేలానికి బ్యాంకులు రంగం సిద్ధం చేశాయి. ట్రాన్స్ స్ట్రాయ్ సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు ముహుర్తం ఖరారు చేశారు. సెంట్రల్ బ్యాంక్కు సుమారు 452.41 కోట్ల రూపాయలు ట్రాన్స్ ట్రాయ్ బకాయి పడింది. బ్యాంకులను తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వీటి కోసం బిడ్స్ దాఖలుకు ఆగస్టు 14న చివరి తేది అని ప్రకటించింది.
2017 జనవరి 9నాటికి సెంట్రల్ బ్యాంక్కు చెల్లించాల్సిన మొత్తం 452.41 కోట్లు కాగా, వీటికి హామీదారులుగా ట్రాన్స్ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్, రాయపాటితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కెనరా బ్యాంక్కు సంబంధించి సుమారు రూ.300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు నమోదైంది. ఈ బకాయిలు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకుల ద్వారా రూ.3,694 కోట్ల మేర రుణాలను ట్రాన్స్ ట్రాయ్ సంస్థ తీసుకుంది.