Telugu Gateway
Andhra Pradesh

ఆ డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా

ఆ డబ్బు నాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా
X

తెలుగుదేశం పార్టీ నేతలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మచ్చలేని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు. టీడీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చెక్ పోస్టు వద్ద దొరికిన ఆ డబ్బు తనది అని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నా క్యారెక్టర్ గురించి ప్రజలు అందరికీ తెలుసు. బాలు అన్న అతను మా పార్టీనే. అదేమీ రహస్యం కాదు. అతను వ్యాపారం చేసుకోకూడదా?. అతనే స్వయంగా డబ్బు నాది అని చెబుతున్నాడు. అయినా టీడీపీ అభాండాలు వేయటం సరికాదు. మంత్రి డబ్బులు అని చెప్పి ఎలా మాట్లాడతాడు. సిగ్గుండాలి అలా మాట్లాడటానికి. లోకేష్ క్షమాపణ చెప్పాలి.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ..మంచి పద్దతి కాదు. లోకేష్ కు వేరే పనేమీ లేదు. ట్వీట్లు చేయటం తప్ప. తెలుగుదేశం ఎమ్మెల్యేలే చెబుతున్నారు. తమ దగ్గర లోకేష్ డబ్బులు తీసుకున్నారని. నాపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి. చేయాలనుకుంటే ప్రకాశం జిల్లాలో మొత్తం టీడీపీని ఖాళీ చేయిస్తా. నా గురించి మాట్లాడతావు ఇష్టం వచ్చినట్లు. దమ్ముంటే లోకేష్ నిరూపించాలి’ అంటూ ఆగ్రహంతో మంత్రి బాలినేని మీడియా ముందు వ్యాఖ్యానించారు. కొంత మంది టీడీపీ ముఖ్యనేతలను వైసీపీలోకి తీసుకెళ్ళామనే కోపంతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని విమర్శించారు. ప్రజా జీవితంలో ప్రజల తిరస్కరణకు గురైన లోకేష్ ఇలాంటి విమర్శలు చేయటం సరికాదన్నారు. బోండా ఉమా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని..నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

Next Story
Share it