వైసీపీకి ఇసుక దెబ్బ ఖాయం

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వదని..ఉన్న ఈసీబీ రిజర్వేషన్లను కూడా అమలు చేయటంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాపులతోపాటు అగ్రవర్ణ పేదలు అందరికీ ఈబీసీ రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరారు. అగ్రవర్ణాల్లోనే పేదలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇసుక వ్యవహారంలో టీడీపీకి తగిలిన దెబ్బే వైసీపీకి తగలటం కూడా ఖాయం అని వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక ఒక అందని దాక్షగా మారిపోయిందని అన్నారు. ఇసుక సమస్య వల్ల నిర్మాణదారులతోపాటు కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జనసేన ఒక కొత్త తరం నాయకుల్ని తయారు చేస్తోందని.. అందులో ఒడిదుడుకులు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయని తెలుసన్నారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి ప్రజలకు ఎంత బలంగా సేవ చేయాలో అంత బలంగా సేవ చేస్తామని తెలిపారు.
కరోనా వల్ల సినిమా పరిశ్రమలో కూడా అన్నీ ఆగిపోయాయి. తిరిగి అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్కి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యనించారు.