ఐశ్వర్యారాయ్ కీ కరోనా పాజిటివ్
![ఐశ్వర్యారాయ్ కీ కరోనా పాజిటివ్ ఐశ్వర్యారాయ్ కీ కరోనా పాజిటివ్](http://telugugatewaysite.vocalwire.com/wp-content/uploads/2020/07/Aishwarya-aaradhya-e1594546135664.jpg)
కూతురు ఆరాధ్యకూ కూడా
అమితా బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కరోనా వైరస్ బారిన పడింది. ఇప్పటికే అమితాబచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ అని తేలటంతో వాళ్లిద్దరూ ముంబయ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఇద్దరికి చాలా కొద్ది పాటి కరోనా లక్షణాలు మాత్రమే ఉండటంతో వీరిద్దరూ ఇప్పుడు నిలకడగానే ఉన్నారు. ఆదివారం నాడు వచ్చిన ఫలితాల్లో అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్, కూతురు అరాధ్య కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో అమితా బచ్చన్ ఫ్యామిలీలో మొత్తం నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అయింది. అమితా బచ్చన్ కు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వెంటనే ముంబయ్ బృహన్ మున్సిపల్ కార్పరేషన్ అధికారులు శానిటైజ్ కార్యక్రమాలు ప్రారంభించారు. అదే సమయంలో అమితాబచ్చన్ ఇంటిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటిస్తూ ఇంటి గేటుకు ఓ పెద్ద పోస్టర్ ను అంటించారు. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ముంబయ్ లో ఉన్న విషయం తెలిసిందే.అమితాబచ్చన్ భార్య జయాబచ్చన్ కు మాత్రం కరోనా నెగిటివ్ గా ఫలితాలు వచ్చాయి.