Telugu Gateway
Telangana

తెలంగాణ సీఎంవోలో కరోనా వైరస్ కలకలం!

తెలంగాణ సీఎంవోలో కరోనా వైరస్ కలకలం!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యాలయాన్ని కరోనా వైరస్ తాకింది. సీఎంవోలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా సోకటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం మెట్రో రైల్‌ భవన్‌లో సీఎంవో అధికారులు పనిచేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ పనిచేస్తున్న సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి ఆ ఉద్యోగి కుమారుడు హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి వైరస్‌ సోకిందని గుర్తించడం జరిగింది.

దీంతో సీఎంవో ఆఫీసుకు ఎవరూ రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు సీఎంవో కార్యాలయం బంద్ కానుందని సమాచారం. ఇప్పటి వరకూ మొత్తం 30 మంది సిబ్బంది శాంపిళ్లను చెస్ట్ ఆస్పత్రి వైద్య సిబ్బంది సేకరించింది. సీఎంలోలో పని చేస్తున్న వారిలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఉన్నారు. మరోవైపు సీఎంవో మొత్తం సిబ్బంది శానిటైజేషన్ చేస్తోంది.

Next Story
Share it