Telugu Gateway
Cinema

మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్

మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్
X

‘సర్కారు వారి పాట’ టైటిల్ తో ఈ సినిమాపై ఆసక్తి పెంచేలా చేశారు హీరో మహేష్ బాబు. పరశురామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ప్రముఖ నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్ స్టా లైవ్ లో స్పష్టం చేయటంతో ఈ అంశంపై సస్పెన్స్ వీడిపోయింది.

కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు మరోసారి గతంలో సూపర్ హిట్ కాంబినేషన్ గా నిలిచిన ‘భరత్ అనే నేను’ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరిగింది. కీర్తి ప్రకటనతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయింది. హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Next Story
Share it