కరోనానే కాదు...పెట్రోల్, డీజిల్ రేట్లను అన్ లాక్ చేశారా!
BY Telugu Gateway24 Jun 2020 2:10 PM GMT
X
Telugu Gateway24 Jun 2020 2:10 PM GMT
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అయితే ఈ సారి ఆయన టార్గెట్ ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లపై. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా కూడా కేంద్రం మాత్రం ప్రతి రోజూ ఈ రేట్లు పెంచుతూ ప్రజలపై భారం మోపుతూనే ఉంది. అందుకే రాహుల్ ట్విట్టర్ వేదికగా ఓ గ్రాఫ్ తో సహా మోడీపై వ్యంగాస్త్రాలు సంధించారు.
మోదీ ప్రభుత్వం మహమ్మారి కరోనాతోపాటు పెట్రోల్ డీజిల్ ధరలకు కూడా అన్లాక్ సడలింపులు ఇచ్చిందేమో అని వ్యాఖ్యానించారు. అన్లాక్తో కరోనా కేసుల్లో పెరుగుదలే కాదు.. ఇంధన ధరలు కూడా భగ్గుమంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఇంధన ధరలు, కరోనా కేసుల పెరుగుదలను సూచించే ఓ గ్రాఫ్ను ఆయన షేర్ చేశారు.
Next Story