Telugu Gateway
Politics

ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్

ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్
X

‘ఎందుకు మౌనంగా ఉన్నారు. ఎందుకు వాస్తవాలు దాస్తున్నారు’ అంటూ ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత సైనికుల వీరమరణం పొందిన ఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. భారత సైనికులను చంపి దేశ భూబాగాన్ని ఆక్రమించుకోవటానికి చైనాకు ఎంత ధైర్యం అని ఆయన ప్రశ్నించారు.

జరిగిన నష్టం చాలు..ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి అని ప్రశ్నించారు. ప్రజలు అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన అధికారులు, సైనికుల బాధను వర్ణించటానికి మాటల రావటం లేదు. అంత బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో తాము అంతా అండగా నిలుస్తామన్నారు.

Next Story
Share it