తెలంగాణలోమరో ఎమ్మెల్యేకు కరోనా
BY Telugu Gateway15 Jun 2020 4:29 PM IST

X
Telugu Gateway15 Jun 2020 4:29 PM IST
కరోనా బారిన పడే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో ఇఫ్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇఫ్పుడు కొత్తగా మరో ఎమ్మెల్యేకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బండి పడుతున్నారు. టెస్ట్ లు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే కరోనా సోకిన మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కాంటాక్ట్ అయినందునే ఆయనకు కూడా కరోనా వచ్చినట్లు చెబుతున్నారు. మరో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story