స్వీయ నిర్భందంలోకి హరీష్ రావు
BY Telugu Gateway13 Jun 2020 12:02 PM IST
X
Telugu Gateway13 Jun 2020 12:02 PM IST
తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్వీయ నిర్భందంలోకి వెళ్ళారు. సిద్ధిపేటలోని ఆయన నివాసంలో ఉండే వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలటంతో మంత్రి హరీష్ రావు ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ లోని తన నివాసంలోనే స్వీయ నిర్భందంలోకి వెళ్లారు.
మంత్రితోపాటు ఆయన వెంట ఉన్న 51 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ 17 మందికి మాత్రం నెగిటివ్ వచ్చింది. మిగిలిన ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నారు. మరో వైపు తాజాగా ఓ ఎమ్మెల్యే కరోనా పాజిటివ్ అని తేలటంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story