Telugu Gateway
Andhra Pradesh

ఏపీ నుంచి కర్ణాటక కు బస్సులు

ఏపీ నుంచి కర్ణాటక కు  బస్సులు
X

అంతరాష్ట్ర సర్వీసుల్లో భాగంగా తొలుత ఏపీ నుంచి హైదరాబాద్ కు బస్సులు ప్రారంభం అవుతాయనుకున్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ సర్వీసులకు అనుమతి ఇఛ్చినా కానీ ఎందుకో వ్యవహారం ముందుకు కదలటం లేదు. కానీ ఈ తరుణంలో కర్ణాటక నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సులు నడపటానికి ఏపీ సర్కారు రెడీ అయిపోయింది.

ఈ మేరకు ఏపీఎస్ఆర్ టీసీ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా బుకింగ్ కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తొలి విడత 168 బస్ లను నడుపుతారు. క్రమేపి 500 బస్ సర్వీసులకు పెంచుతారు. మరి ఏపీ నుంచి హైదరాబాద్ కు సర్వీసులు, హైదరాబాద్ నుంచి ఏపీకి సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తేలాల్సి ఉంది. ఈ రూటులో ప్రయాణించేందుకు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.

Next Story
Share it