Telugu Gateway
Politics

బిజెపిపై ఈటెల ఘాటు వ్యాఖ్యలు

బిజెపిపై ఈటెల ఘాటు వ్యాఖ్యలు
X

తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణంలో ఘోరంగా విఫలమైందంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ మండిపడింది. నడ్డాతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కరోనా విషయంలో హైదరాబాద్ డేంజర్ జోన్ లో ఉందని వ్యాఖ్యానించారు. ఈటెల ఆదివారం నాడు టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడూతు బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీది నీచ సంస్కృతి. శవాల మీద పేలాలు ఎరుకునే స్వభావం మీది.. ఇలాంటి చిల్లర రాజకీయాలు తగదు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కట్టడి ఎలా ఉందో చెప్పాలి’ అంటూ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చిల్లరబొల్లరగా మాట్లాడుతున్నారు..లేనిపోని ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం పై చేస్తున్నారని విమర్శించారు. ఇది విమర్శలు చేసే సమయం కాదని, ప్రపంచ వ్యాప్తంగా కరోన అత్యధికంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ‘నడ్డా చిల్లర ఆరోపణలు చేస్తున్నడు.. పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. జాతీయ స్థాయి నేతలు మాట్లాడే మాటలు కాదు. గల్లీ స్థాయి లీడర్లు మాట్లాడే మాటలు ఇవి.

లాక్ డౌన్ ఉన్నప్పుడు చప్పట్లు కొట్టండి దీపాలు పెట్టండి అన్నప్పుడు ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నా మా సీఎం మాత్రం అన్నింటికి సహకరించారు. రెడ్ జోన్,కంటైన్మెంట్ జోన్లతో వైరస్ వ్యాప్తి అడ్డుకున్నాం. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నప్పుడు కంటైన్మెంట్ చేసి చూపెట్టారు. కంటైన్మెంట్ అన్న పదానికి అర్థం తెలియదు బీజేపీ నేతలకు. దీనికి అర్థం చెప్పింది మొదటి వ్యక్తి సీఎం కేసీఆర్. మార్కజ్ విషయంలో కూడా ముందు చెప్పింది సీఎం కేసీఆరే ’ అని ఈటెల తెలిపారు. సీఎం కెసీఆర్ నిరంతరం సమీక్షలు జరుపుతూ కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

Next Story
Share it