Telugu Gateway
Andhra Pradesh

నూతన ఎంపీలకు సీఎం జగన్ అభినందనలు

నూతన ఎంపీలకు సీఎం జగన్ అభినందనలు
X

రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ ఎంపీలకు జగన్ అభినందనలు తెలిపారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి వారితో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. శుక్రవారం నాడు జరిగిన ఎన్నికలో నాలుగు సీట్లను వైసీపీ దక్కించుకున్న విషయం తెలిసిందే.

Next Story
Share it