Telugu Gateway
Politics

రాహుల్ పై అమిత్ షా ఫైర్

రాహుల్ పై అమిత్ షా ఫైర్
X

చైనా సరిహద్దులోని భారత్ భూ భాగంలో ఎవరూ రాకపోతే భారత సైనికులు ఎలా మృతి చెందారు? ఎక్కడ మృతి చెందారు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ చిల్లర రాజకీయాలు మానుకుని, దేశం తరపున నిలబడాలని వ్యాఖ్యానించారు. దేశమంతా ఏకతాటిపై నిలిచిన ఈ తరుణంలో కూడా రాహుల్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా అందరూ సంఘీభావంతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన అమిత్ షా గల్వాన్ లో గాయపడిన ఓ సైనికుడి తండ్రి చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా తన పోస్ట్ కు జత చేశారు అమిత్ షా. తన కుమారుడు సైన్యంలో ఉండి పోరాడుతూ గాయపడ్డారని..ఇంకా పోరాటం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని కోరారు. బలమైన మన సైన్యం చైనాను ఓడించగలదని పేర్కొన్నారు.

Next Story
Share it