లోకేష్ నీ ట్వీట్ అబద్ధం.. తెలుసుకో
BY Telugu Gateway2 May 2020 4:09 PM GMT
X
Telugu Gateway2 May 2020 4:09 PM GMT
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ పై టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి స్పందించారు. లాక్ డౌన్ వేళ ఛైర్మన్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి దర్శనం చేసుకోవటాన్ని లోకేష్ తప్పుపట్టారు. సామాన్యులకు ఓ రూలు..టీటీడీ ఛైర్మన్ కు ఓ రూలా అని ఆయన ప్రశ్నించారు. ఛైర్మన్ సుబ్బారెడ్డి దర్శన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీనిపై సుబ్బారెడ్డి కూడా ట్వీట్ చేశారు.
‘నారా లోకేష్ ...ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఒకసారి టీటీడీ ఛైర్మన్ హాజరు కావటం ఆనవాయితీ. నేనూ అలాగే వెళ్లాను. నా తల్లి, నా భార్య తప్ప బంధువులు ఎవరూ లేరు. ఫోటోలో ఉన్నది అందరూ టీటీడీ ఉద్యోగులు. నీ ట్వీట్ అబద్ధం. కొంచెం అయినా పాపభీతి ఉండాలి. తప్పుతెలుసుకో’ అంటూ వై వీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Next Story