ఎంత భయంకరమైన ఏడాది ఇది
BY Telugu Gateway7 May 2020 5:11 AM GMT
X
Telugu Gateway7 May 2020 5:11 AM GMT
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన టీవీల్లో వచ్చిన దృశ్యాలు చూసి షాక్ కు..ద్రిగ్భాంతికి గురైనట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఇది ఎంత భయంకరమైన ఏడాది అని కెటీఆర్ ట్వీట్ చేశారు.
ఓ వైపు ఈ ఏడాది ప్రారంభం అయిన కొద్ది నెలలకే ప్రపంచాన్ని కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడించటం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది ఇంకా ప్రజలను వీడటం లేదు. ఈ తరుణంలో విశాఖ గ్యాస్ లీక్ తో పదుల సంఖ్య లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Next Story