Telugu Gateway
Politics

ఆ రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు

ఆ రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు
X

మహారాష్ట్ర, తమిళనాడులు లాక్ డౌన్ ను మే 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఆదివారం ఉధయమే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించగా..తమిళనాడు మూడు గంటల సమయంలో మే 31 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ లో లాక్ డౌన్ ను మే 29 వరకూ అని సీఎం కెసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయ్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అయ్యాయి.

ఇన్ని రోజుల లాక్ డౌన్ తర్వాత కూడా అవి ఏ మాత్రం తగ్గకపోగా..రోజుకో కొత్త రికార్డు నమోదు అవుతోంది. తమిళనాడులోనూ కేసుల సంఖ్య భారీగానే ఉంది.తమిళనాడులో మొత్తం 10585 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాల మే 31 వరకూ లాక్ డౌన్ ను పొడిగించాయి. వీటితో పోలిస్తే తెలంగాణ లో కేసుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అయినా సరే తెలంగాణ సర్కారు కూడా మే 29 వరకూ లాక్ డౌన్ ను పొడిగించింది.

Next Story
Share it