తెలంగాణాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
BY Telugu Gateway9 May 2020 9:06 PM IST

X
Telugu Gateway9 May 2020 9:06 PM IST
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు తెలంగాణలో మళ్ళీ పెరిగాయి. శనివారం నాడు కొత్తగా 31 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1163కు పెరిగింది. కొత్తగా వచ్చిన 31 కేసుల్లో 30 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.
ఒక కేసు మాత్రం వలస వచ్చిన వ్యక్తిది. కరోనా నుంచి కోలుకుని శనివారం నాడు 24 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నయాక్టివ్ కేసుల సంఖ్య 382 మంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 30 మంది అని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Next Story